ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andrew Symonds మృతి దిగ్భ్రాంతి కలిగించింది: కోహ్లీ

ABN, First Publish Date - 2022-05-16T01:05:13+05:30

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై:  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతిపై టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. Symonds మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు భారత మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo)లో పోస్టు చేశాడు. సైమండ్స్ మరణవార్త తనను తీవ్రంగా బాధపెట్టిందని, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు అతడి కుటుంబానికి మనోస్థైర్యం నింపాలని ఆకాంక్షించాడు.


కాగా, ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, రాడ్ మార్ష్ మృతి చెందారు. ఇప్పుడు మరో క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆసీస్ క్రికెట్‌ను కలవరపరిచింది. సైమండ్స్ మృతి వార్త తెలిసిన వెంటనే తాజా మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. సైమండ్స్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



Updated Date - 2022-05-16T01:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising