తిరిగేస్తున్న టీమిండియా ఆటగాళ్లు
ABN, First Publish Date - 2022-06-30T08:51:41+05:30
తిరిగేస్తున్న టీమిండియా ఆటగాళ్లు
బీసీసీఐ కొవిడ్ సూచనలు బేఖాతరు
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొవిడ్ బారిన పడడంతో.. టెస్ట్ టీమ్ ఆటగాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. కానీ, భారత ఆటగాళ్లు వాటిని ఏమాత్రం ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇంగ్లండ్తో రీషెడ్యూల్ అయిన 5వ టెస్ట్ ముందు విరాట్, పంత్ సహా చాలా మంది ఆటగాళ్లు ఏమాత్రం కొవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండా షాపింగ్లు, రెస్టారెంట్లకు తిరిగేస్తున్నారు. బర్మింగ్హామ్లో ఓ రెస్టారెంట్లో వీరు పార్టీ చేసుకోవడంతోపాటు హోటల్ సిబ్బందితో ఫొటోలు కూడా దిగారు. వీటిని నెట్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. ఫ్యాన్స్తో భౌతిక దూరం పాటించకుండా సెల్ఫీలు, కరచాలనాలు చేస్తుండంతో మళ్లీ కరోనా విజృభిస్తుందేమోనని మేనేజ్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Updated Date - 2022-06-30T08:51:41+05:30 IST