ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 world cup 2022 prize money: టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు దక్కేది ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2022-10-01T00:40:04+05:30

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనలిస్టులకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో నంబరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)  ఫైనలిస్టులకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో నంబరు 13న జరగున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup ) ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుకు దాదాపు రూ. 13 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) పారితోషికం లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు అందులో సగం అంటే రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా ప్రకటించింది. అక్టోబరు 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. 16 జట్లు ట్రోఫీ కోసం పోటీపడతాయి. మొత్తం 5.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కాగా, సెమీ ఫైనల్ దశలో ఓడిపోయిన జట్లకు చెరో రూ. 3.25 కోట్లు ఇస్తారు. 


సూపర్-12 దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 56 లక్షల చొప్పున చెల్లిస్తారు. తొలి రౌండ్‌లోనే ఓటమి మూటగట్టుకున్న జట్లకు రూ. 32 చొప్పున అందిస్తారు. ఈ టోర్నీలో పాల్గొన్న జట్లలో 8 జట్లు.. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్లు నేరుగా సూపర్ 12లో అడుగుపెడతాయి. మిగతా 8 జట్లు.. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ జట్లు గ్రూప్‌-ఎలో, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇర్లాండ్, జింబాబ్వే గ్రూప్-బిలో ఉన్నాయి. ఇవి తొలి రౌండ్‌లో తలపడతాయి.  

Updated Date - 2022-10-01T00:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising