India vs South Africa: భారత బౌలర్ల విజృంభణ.. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
ABN, First Publish Date - 2022-09-29T01:03:11+05:30
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్లో భారత పేసర్లు విజృంభించారు. అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ రెచ్చిపోవడంతో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా కేవలం 9 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయింది.
తిరువనంతపురం: భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్లో భారత పేసర్లు విజృంభించారు. అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ రెచ్చిపోవడంతో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా కేవలం 9 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు చొప్పున తీశారు. ఇందులో నలుగురు డకౌట్గా వెనుదిరగడం సంచలనం. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్లో క్వింటన్ డీకాక్(1), బావుమా (0), రూసో (0), డేవిడ్ మిల్లర్ (0), స్టబ్స్ (0) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం మార్క్రమ్ (14), పార్నెల్(2) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 5.3 ఓవర్లకు 30/5 పరుగులుగా ఉంది.
కాగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుని దక్షిణాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వరల్డ్ కప్కు ముందు చివరి సిరీస్ కావడంతో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్లకు విశ్రాంతినిచ్చామని, రిషత్ పంత్, అర్షదీప్ సింగ్లను జట్టులోకి తీసుకున్నామని రోహిత్ వెల్లడించాడు. తిరువనంపురం పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ అని పేర్కొన్నాడు. వరల్డ్ కప్కు ముందు ఇది తమకు చాలా ముఖ్యమైన సిరీస్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా చెప్పాడు. కీలకమైన ఈ మ్యాచ్ టాస్ గెలిచుంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు.
తుది జట్లు..
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసో, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, త్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కసిగో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షాంమ్సీ.
Updated Date - 2022-09-29T01:03:11+05:30 IST