2nd T20I: దక్షిణాఫ్రికాపై 16 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ABN, First Publish Date - 2022-10-03T04:41:07+05:30
2nd T20I: దక్షిణాఫ్రికాపై 16 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
గౌహతి: రెండో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 16 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు భారత క్రికెట్ జట్టు భారీ విజయ లక్ష్యాన్ని పెట్టింది. భారత్ నిర్దేశించిన 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు తడబడుతూ ఆడుతూ విజయం సాధించలేకపోయారు. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 221 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికా బ్యాటింగ్: డేవిడ్ మిల్లర్ 85 నాటౌట్, డికాక్ 65 నాటౌట్గా నిలిచారు. ఇండియా: సూర్యకుమార్ 61, రాహుల్ 57, కోహ్లీ 49 నాటౌట్గా నిలిచాడు. ఈ నెల 4న ఇండోర్లో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.
Updated Date - 2022-10-03T04:41:07+05:30 IST