T20 World Cup: టీ20 ప్రపంచకప్కు ముందు కొత్త జెర్సీని విడుదల చేసిన టీమిండియా
ABN, First Publish Date - 2022-09-19T02:49:42+05:30
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup)నకు ముందు టీమిండియా కొత్త జెర్సీ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup)నకు ముందు టీమిండియా కొత్త జెర్సీ (new jersey)ని బీసీసీఐ విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు (team india) కొత్త జెర్సీతో ఆడనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా లీకయ్యాయి. తాజాగా ఈ ఊహాగానాలకు తెరపడింది. ఆదివారం బీసీసీఐ (bcci) కొత్త కిట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో రోహిత్శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహిళా జట్టు సభ్యులు హర్మన్ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రేణుకా సింగ్ వంటివారు కొత్త జెర్సీ ధరించారు.
కొత్త జెర్సీలో డ్యూయల్ టోన్ ఉపయోగించారు. భుజాలు, స్లీవ్స్ వద్ద ముదురు నీలం రంగును ఉపయోగించగా, మిగతా కిట్కు లైట్ బ్లూ షేడ్తో తీర్చిదిద్దారు. జెర్సీకి ఎడమవైపు కొంచెం డిజైన్ కూడా ఉంది. ఈ కిట్ను దేశంలోని ప్రతీ క్రికెట్ అభిమానికి అంకితమిస్తున్నట్టు ఈ ఫొటోకు బీసీసీఐ క్యాప్షన్ తగిలించింది.
ఈ జెర్సీ ధరించి భారత జట్టు టీ20 ప్రపంచకప్లో తలపడుతుంది. ప్రపంచకప్లో తలపడే జట్టును బీసీసీఐ ఈ నెల 12న ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మ జట్టును నడిపించనుండగా, కేఎల్ రాహుల్ డిప్యూటీగా ఉంటాడు.
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్బై ఆటగాళ్లు
మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
Updated Date - 2022-09-19T02:49:42+05:30 IST