ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్య ఛేదనలో ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా

ABN, First Publish Date - 2022-07-18T01:44:24+05:30

ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 21 పరుగులకే రెండు కీలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంచెస్టర్: ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 21 పరుగులకే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధవన్ మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. మూడో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ శిఖర్ ధవన్ అవుటయ్యాడు. మూడు బంతులు ఆడిన ధవన్ ఒక్క పరుగు మాత్రమే చేసి టోప్లీ బౌలింగులో జాసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టోప్లీకే చిక్కి పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన రోహిత్ 21 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. కోహ్లీ 12, రిషభ్ పంత్  2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-18T01:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising