ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకౌట్‌కు భారత్‌

ABN, First Publish Date - 2022-10-04T09:03:20+05:30

కామన్వెల్త్‌ పతక విజేత శ్రీజ అదరగొట్టడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్

చెంగ్డూ: కామన్వెల్త్‌ పతక విజేత శ్రీజ అదరగొట్టడంతో.. భారత మహిళల జట్టు వరల్డ్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో ఈజిప్ట్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11-6, 11-4, 11-1తో గొడా హన్‌పై, రెండో మ్యాచ్‌లో 11-8, 11-8, 11-6తో దినా మిష్రఫ్‌పై గెలిచింది. మనికా బాత్రా 8-11, 11-6, 11-7, 2-11, 11-8తో దినాపై చెమటోడ్చి నెగ్గింది. దివ్య చిటాలే ఓటమిపాలైంది.


కాగా, పురుషుల జట్టు నాకౌట్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-2తో కజకిస్థాన్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో సాథియన్‌ 11-1, 11-9, 11-5తో జొలుడెవ్‌పై నెగ్గినా.. మరో మ్యాచ్‌లో కిరిల్‌ చేతిలో 11-6, 5-11, 14-12, 9-11, 6-11తో ఓడాడు. హర్మీత్‌ 6-11, 8-11, 9-11తో కిరిల్‌ చేతిలో ఓడినా.. మానవ్‌ 12-10, 11-1, 11-8తో అలన్‌పై గెలిచాడు. నిర్ణాయక మ్యాచ్‌లో హర్మీత్‌ 12-10, 11-9, 11-6తో డెనిపై నెగ్గి భారత్‌కు విజయాన్నందించాడు. 

Updated Date - 2022-10-04T09:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising