ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండంతస్తుల విశాలమైన భవనాన్ని కొనుగోలు చేసిన సౌరవ్ గంగూలీ

ABN, First Publish Date - 2022-05-21T02:30:48+05:30

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో విశాలమైన భవనాన్ని కొనుగోలు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో విశాలమైన భవనాన్ని కొనుగోలు చేశాడు. బీరేన్ రోడ్డులోని తన నివాసంలో 49 ఏళ్లపాటు గడిపేసిన గంగూలీ.. తాజాగా లోయర్ రాడన్ వీధిలో విశాలమైన రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భవనంలో 12కుపైగా విశాలమైన గదులున్నాయి. విశాలమైన పచ్చికతో లాన్ ఉన్న ఈ భవంతి రణగొణ ధ్వనుల రద్దీ రోడ్డుకు దూరంగా ప్రశాంతవాతావరణంలో ఉంది.


వీధి చివరన ఉన్న ఈ భవనం పచ్చని ప్రకృతి మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు. నగరం మధ్యలో ఉండడంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నాడు. భార్య డోనా, కుమార్తె సనా, తల్లి నిరుపా గంగూలీ పేర్లపై ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.  

Updated Date - 2022-05-21T02:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising