చెలరేగిన ‘సౌత్’ బౌలర్లు
ABN, First Publish Date - 2022-09-22T06:46:31+05:30
సౌత్జోన్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో బుధవారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్జోన్ తడబడింది.
వెస్ట్జోన్ 250/8 ఫ దులీప్ ట్రోఫీ ఫైనల్
కోయంబత్తూరు: సౌత్జోన్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో బుధవారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్జోన్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అజింక్యా రహానె (8), శ్రేయాస్ అయ్యర్ (37) లాంటి టీమిండియా ఆటగాళ్లు విఫలమైనా.. గుజరాత్ యువ ఆటగాడు హెట్ పటేల్ (96 బ్యాటింగ్) అజేయ అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. వెస్ట్ జట్టు ఆ స్కోరైనా చేయగలిగింది. సాయి కిషోర్ 3 వికెట్లు.. తెలుగు కుర్రాడు చీపురుపల్లి స్టీఫెన్, బాసిల్ థంపి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆరంభంలోనే వెస్ట్జోన్ 16/3తో కష్టాల్లోపడ్డ దశలో అయ్యర్, సర్ఫ్రాజ్ (34) నాలుగో వికెట్కు 48 పరుగులు జోడించారు. పటేల్, అతీత్ సెథ్ (25) ఏడో వికెట్కు 63 రన్స్ నమోదు చేశారు. కాగా, జట్టు స్కోరు 167/8తో నిలిచిన దశలో థంపి, పటేల్ కలిసి 9వ వికెట్కు 83 రన్స్ జోడించడంతో వెస్ట్జోన్ కోలుకొంది.
Updated Date - 2022-09-22T06:46:31+05:30 IST