ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సాయ్‌’ అకాడమీలో 33 మందికి కొవిడ్‌

ABN, First Publish Date - 2022-01-22T09:12:14+05:30

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో పురుషుల హాకీ సీనియర్‌ జట్టులోని 16 మంది, మహిళల జట్టులోని ఇద్దరు, ఒక కోచ్‌ కొవిడ్‌ బారిన పడగా, మహిళల జూనియర్‌ హాకీ టీమ్‌లోని 15 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సాయ్‌ బెంగళూరు కేంద్రం తెలిపింది. ఇక, కిందటి వారం పటియాలలోని సాయ్‌ కేంద్రంలో 25 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.


హర్భజన్‌కు కరోనా ::

మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్విటర్‌లో తెలిపాడు. ఈ నాలుగైదు రోజుల్లో తనను కలిసిన వారు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని హర్భజన్‌ విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2022-01-22T09:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising