భారత్కు ‘కాంపౌండ్’ స్వర్ణం
ABN, First Publish Date - 2022-05-22T09:22:11+05:30
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్ జట్టు స్వర్ణంతో అదరగొట్టింది.
గ్వాంగ్జు (కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్ జట్టు స్వర్ణంతో అదరగొట్టింది. శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్లతో కూడిన బృందం 232-230తో ఆడ్రియెన్, జీన్ ఫిలిప్, క్వెంటిన్ బరెర్ (ఫ్రాన్స్)లను ఓడించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్లో భారత్ కాంస్యం సాధించింది. ఆరో సీడ్ అభిషేక్, అవ్నీత్ కౌర్ జోడీ 156-155తో టర్కీకి చెందిన నాలుగో సీడ్ అమిర్కన్ హనే, ఐసే బెరా సుజెర్ను ఓడించింది.
Updated Date - 2022-05-22T09:22:11+05:30 IST