రాణించిన భరత్
ABN, First Publish Date - 2022-06-24T09:33:02+05:30
ఇంగ్లండ్తో టెస్టు సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ తొలి రోజే తడబడింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 246/8
వామప్ మ్యాచ్
లీసెస్టర్షైర్: ఇంగ్లండ్తో టెస్టు సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ తొలి రోజే తడబడింది. అయితే ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ (70 బ్యాటింగ్) అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 246/8 స్కోరు చేయగలిగింది. క్రీజులో భరత్తో పాటు షమి (18 బ్యాటింగ్) ఉన్నాడు. మరోవైపు లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో జరుగుతున్న ఈ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్కు తొలి రోజే వర్షం అంతరాయం కలిగిం చింది. దీంతో గురువారం 60.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. అంతకుముందు 81/5 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును విరాట్ (33)తో కలిసి భరత్ ఆరో వికెట్కు 57 పరుగులు జోడించాడు. రోహిత్ (25), ఉమేశ్ (23), గిల్ (21) ఫర్వాలేదనిపించారు. మరోవైపు లీసెస్టర్ జట్టు తరఫున బుమ్రా, ప్రసిద్ధ్ కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. రోమన్ వాకర్కు ఐదు వికెట్లు దక్కాయి.
Updated Date - 2022-06-24T09:33:02+05:30 IST