ఐపీఎల్ వేలం: షార్ట్ లిస్ట్ ఆటగాళ్లలో టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ యశ్ధుల్
ABN, First Publish Date - 2022-02-02T01:00:22+05:30
ఐపీఎల్ మెగా వేలానికి ముందు 590 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ విడుదల ఫిబ్రవరి 12,
న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలానికి ముందు 590 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ విడుదల ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేలం జరగనుంది. మార్క్యూ జాబితాలో 10 మందితో సహా టాప్-3 ధరల బ్రాకెట్లలో 102 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, ప్రస్తుతం వెస్టిండీస్లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లు కూడా షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన డేవాల్డ్ బ్రెవిస్ కూడా ఉన్నాడు. ప్రపంచకప్లో అద్భుతంగా రాణిస్తున్న బ్రెవిస్ను అందరూ ‘బేబీ ఏబీ’ అని పిలుచుకుంటూ ఉంటారు. అతడి బ్యాటింగ్ శైలి డివిలియర్స్ను పోలి ఉండడమే అందుకు కారణం. రూ. 20 లక్షల బేస్ ప్రైస్ జాబితాలో అతడి పేరుంది. అండర్ 19 ప్రపంచకప్లో బేబీ ఏబీ 5 మ్యాచుల్లో 368 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలున్నాయి.
ఇక, భారత అండర్-19 జట్టు కెప్టెన్ యశ్ ధుల్ పేరు షార్ట్ లిస్ట్లో చోటు దక్కింది. అతడి కనీస ధరను కూడా రూ. 20 లక్షలుగా నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రపంచకప్లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన ధుల్ ఆకట్టుకున్నాడు. అలాగే, యువ బౌలర్ రాజ్యవర్ధన్ హంగార్గేకర్కు రూ. 30 లక్షల బేస్ ప్రైస్ జాబితాలో చోటు దక్కింది. రాజ్యవర్ధన్ మిడిలార్డర్ హిట్టర్ కూడా.
Updated Date - 2022-02-02T01:00:22+05:30 IST