దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు రాక
ABN, First Publish Date - 2022-06-03T09:57:35+05:30
ఐదు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు గురువారం ఉదయం భారత్లో అడుగుపెట్టింది. హోటల్కు చేరిన ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఐదు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు గురువారం ఉదయం భారత్లో అడుగుపెట్టింది. హోటల్కు చేరిన ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. తెంబా బవుమా నేతృత్వంలోని సఫారీలు శుక్రవారం నుంచి ప్రాక్టీస్ ఆరంభించనున్నారు. ఇక భారత ఆటగాళ్లు ఈనెల 5న ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ప్లేఆఫ్స్కు వచ్చిన ఐపీఎల్ ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా జట్టులో చేరే అవకాశం ఉంది. ఈనెల 9 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
Updated Date - 2022-06-03T09:57:35+05:30 IST