Virat Kohli: హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లో ‘విరుష్క’.. ఇంటిపై మువ్వన్నెల రెపరెపలు
ABN, First Publish Date - 2022-08-15T21:30:03+05:30
దేశం మొత్తం స్వాత్రంత్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
ముంబై: దేశం మొత్తం స్వాత్రంత్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగమయ్యారు. ముంబైలోని తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మువ్వన్నెల పతాకం వద్ద దిగిన ఫొటోలను అనుష్క శర్మ (Anushka Sharma) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనుష్క చికంకారీ ఎంబ్రాయిడ్ కుర్తాను ధరించగా, కోహ్లీ (Virat Kohli) బ్లాక్ టి-షర్ట్ ధరించి క్యాజువల్ లుక్లో కనిపించాడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కోహ్లీ కూడా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ‘75 అద్భుతమైన సంవత్సరాలు. భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అని క్యాప్షన్ తగిలించాడు. కాగా, ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాల డిస్ప్లే చిత్రాలను మువ్వన్నెల జెండాతో రీప్లేస్ చేశాడు.
Updated Date - 2022-08-15T21:30:03+05:30 IST