సౌండ్ పెంచవయ్యా సామీ.. బ్రాడ్కాస్టర్లపై విసుక్కున్న రోహిత్ శర్మ
ABN, First Publish Date - 2022-04-09T02:20:42+05:30
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ
ముంబై: కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాడ్కాస్టర్లపై చిరాకు పడ్డాడు. ఓడిన ముంబై ఇప్పటి వరకు ఐపీఎల్లో బోణీ కొట్టలేకపోయింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం నిర్వహించే కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ బ్రాడ్కాస్టర్లపై రోహిత్ చిరాకు ప్రదర్శించాడు.
కామెంటేటర్ డేనీ మోరిసన్ అడిగిన ప్రశ్న రోహిత్కు సరిగా వినిపించలేదు. అప్పటికే ఓటమి భారంతో చిరాగ్గా ఉన్న రోహిత్ బ్రాడ్కాస్టర్ల వైపు తిరిగి ‘ఆవాజ్ బడావో యార్ ఉస్కా’ (వాటి సౌండ్ పెంచవయ్యా) అంటూ తన చిరాకును వారిపై ప్రదర్శించాడు. అయితే, ఆ తర్వాత తమాయించుకుని జట్టు ఓటమిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది.
Updated Date - 2022-04-09T02:20:42+05:30 IST