ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-03-20T20:20:44+05:30

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. భర్త ఉండగానే ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. భర్త ఉండగానే ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఐదేళ్ల నుంచి వారి మధ్య అఫైర్ కొనసాగుతోంది.. ఇటీవల ఆమెకు ఓ యువకుడు దగ్గరయ్యాడు.. ఆ యువకుడితో కూడా ఆ మహిళ శారీరక బంధం పెట్టుకుంది.. విషయం తెలుసుకున్న పాత లవర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. ఆ యువకుడికి మద్యం సేవిద్దామని చెప్పి తీసుకెళ్లి చంపేశాడు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


భోపాల్‌కు సమీపంలోని అశోక్ నగర్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి తన ప్రాంతానికే చెందిన ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో ఐదేళ్లుగా అఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆ మహిళ యోగి అనే యువకుడికి దగ్గరైంది. యోగితో కూడా ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యోగిని అంతమొందించాలనుకున్నాడు. 


గత బుధవారం మద్యం సేవిద్దామని యోగిని ధర్మేంద్ర పిలిచాడు. మద్యం తాగిన అనంతరం ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ మహిళ గురించి గొడవ పడ్డారు. ఆ గొడవలో యోగి తలపై ధర్మేంద్ర ఓ పెద్ద బండరాయితో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ధర్మేంద్రను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల ఎదుట ధర్మేంద్ర తన నేరాన్ని అంగీకరించాడు.  

Updated Date - 2022-03-20T20:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising