ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కింట్లోంచి తీవ్ర దుర్వాసన.. ఏంటని అడిగినా స్పందించని 26 ఏళ్ల యువతి.. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే..

ABN, First Publish Date - 2022-05-21T00:47:05+05:30

కొద్ది రోజులుగా పక్కింట్లోంచి దుర్వాసన వస్తుంటే తొలుత స్థానికులు లైట్ తీసుకున్నారు. అయితే క్రమంగా భరించలేనంత దుర్వాసన రావడంతో ఇంట్లో నివసించే 26ఏళ్ల యువతిని ప్రశ్నించారు. కానీ ఆమె నుంచి ఎటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొద్ది రోజులుగా పక్కింట్లోంచి దుర్వాసన వస్తుంటే తొలుత స్థానికులు లైట్ తీసుకున్నారు. అయితే క్రమంగా భరించలేనంత దుర్వాసన రావడంతో ఇంట్లో నివసించే 26ఏళ్ల యువతిని ప్రశ్నించారు. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. అధికారులు వచ్చి తలుపులు పగలగొట్టారు. తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


లక్నోకు చెందిన సునితా దీక్షిత్ హెచ్ఏఎల్ ఇంజినీర్‌గా పని చేసి పదవీ విరమణ పొందింది. అనంతరం తన 26ఏళ్ల కూతురు‌ అంకితతో కలసి ఇందిరా నగర్ అనే ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సునితా దీక్షిత్ కొద్ది రోజుల క్రితం మరణించారు. అయితే తన తల్లి మరణించిన విషయాన్ని అంకిత మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా 10 రోజులు గడిచిపోయాయి. అయితే సునితా దీక్షిత్ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన రావడంతో.. స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అంకితను అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. 



కానీ ఆమె నుంచి ఎటువంటి ఆన్సర్ రాకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నారు. కుళ్లుపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. అంకిత నివసిస్తోందని గ్రహించి షాకయ్యారు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ప్రచి సింగ్‌ అనే వ్యక్తితో సునితా దీక్షిత్ వివాహం 1999లో జరిగిందనీ.. పెళ్లైన కొన్నేళ్లకే ఆ దంపతులు విడిపోయారని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి కూతురు బాగోగులు చూసుకుంటూ సునితా దీక్షిత్ జాబ్ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే అంకిత మానసికంగా సమస్యలు ఎదుర్కొంటోందని అందుకే తల్లి మరణించినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలదని వివరించారు. 


Updated Date - 2022-05-21T00:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising