నెల క్రితమే ఈ 22 ఏళ్ల కుర్రాడికి పెళ్లి.. పొద్దున్నే 4 గంటలకు నిద్రలేపిన తండ్రి.. కొద్ది నిమిషాలకే శవంగా.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-06-18T21:48:51+05:30
ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. ఆర్మీలో చేరాలనే పట్టుదలతో గత నాలుగేళ్లుగా కఠోర సాధన చేస్తున్నాడు..
ఆ యువకుడి వయసు 22 ఏళ్లు.. ఆర్మీలో చేరాలనే పట్టుదలతో గత నాలుగేళ్లుగా కఠోర సాధన చేస్తున్నాడు.. అతనికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది.. కొత్తగా పెళ్లైనా అతను తన సాధన మాత్రం ఆపలేదు.. శనివారం ఉదయం నిద్ర లేచిన ఆ కుర్రాడు రన్నింగ్కు బయల్దేరాడు.. మార్గమధ్యంలో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.. దీంతో ఆ ఇంట్లో విషాదం అలముకుంది.. ఆ కుర్రాడి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.. రాజస్థాన్లోని భరత్పూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
రోడ్డుపై అడుక్కుంటున్న పిల్లలు.. బిస్కెట్ ప్యాకెట్కు బదులు పొరపాటున 10 తులాల బంగారం ఉన్న బ్యాగ్ను ఇచ్చిందో మహిళ.. చివరకు..
భరత్పూర్ జిల్లాలోని గోపాల్గఢ్ పట్టణానికి చెందిన యువకుడు దేవేంద్ర (22) ఆర్మీ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్నాడు. గోపాల్గఢ్ నుంచి బర్ఖేడా గ్రామానికి వెళ్లే నాలుగు కిలోమీటర్ల సింగిల్లేన్ రోడ్డుపై యువకులు రోజూ తెల్లవారుఝామున పరుగెత్తుతుంటారు. రోజూ లాగానే శనివారం కూడా తెల్లవారుజామున 4 గంటలకు దేవేంద్రను తండ్రి నిద్ర లేపారు. గ్రామానికి చెందిన మరికొందరు యువకులతో కలిసి దేవేంద్ర రన్నింగ్కు వెళ్లాడు. చీకట్లో వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని కారు దేవేంద్రను బలంగా ఢీకొట్టింది. దీంతో దేవేంద్ర అక్కడికక్కడే మరణించాడు.
దేవేంద్ర వివాహం 38 రోజుల క్రితం మే 10 న జరిగింది. దేవేంద్ర భార్య ఈ వార్త విని హతాశురాలైంది. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దేవేంద్రను ఢీకొట్టిన వాహనం ఏదో తెలుసుకునే పనిలో ఉన్నారు.
Updated Date - 2022-06-18T21:48:51+05:30 IST