ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరుగింట్లో నుంచి తీవ్ర దుర్వాసన.. కారణమేంటో తెలుసుకునేందుకు స్థానికులు వెళ్లి చూసే సరికి..

ABN, First Publish Date - 2022-06-02T22:03:48+05:30

ఆ ఇంట్లో మానసిక రోగి అయిన 50 ఏళ్ల మహిళ తన కూతురితో కలిసి నివసిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ఇంట్లో మానసిక రోగి అయిన 50 ఏళ్ల మహిళ తన కూతురితో కలిసి నివసిస్తోంది.. గత నాలుగు రోజులుగా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు.. సోమవారం ఉదయం ఆ ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు వచ్చింది.. ఆ ఇంట్లో ఎలుక చనిపోయి ఉంటుందని స్థానికులు భావించారు.. సాయంత్రానికి ఆ దుర్వాసన మరింత ఎక్కువైంది.. అనుమానం వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా కూతురి శవం ముందు ఆ తల్లి కూర్చుని ఉంది.. ఆ శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


ఇది కూడా చదవండి..

నా చావు వార్తను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పండంటూ లేఖలో రాసిన వ్యక్తి.. ఆ నెంబర్‌ ఎవరిదో, అతడి కథేంటో పోలీసులకు తెలిసి..


కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన నాగమ్మ (50) అనే మహిళ మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఆమె కూతురు రూప (31) భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లితో పాటే కలిసి ఉంటోంది. హోమ్‌గార్డుగా పని చేసే రూప మూడేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఏడాది కిందట ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండేది. తల్లీకూతుళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. గత నాలుగు రోజులుగా వారి ఇల్లంతా నిశబ్దంగా ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. గత నాలుగు రోజులుగా ఆ ఇద్దరూ ఇంటి బయటకు కూడా రాలేదు. 


సోమవారం ఉదయం ఆ ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు వచ్చింది. ఆ ఇంట్లో ఎలుక చనిపోయి ఉంటుందని స్థానికులు భావించారు. అయితే, సాయంత్రానికి ఆ దుర్వాసన మరింత ఎక్కువైంది. అనుమానం వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా కూతురి శవం ముందు ఆ తల్లి కూర్చుని ఉంది. ఆ శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మూడు రోజులుగా కూతురి శవం పక్కనే నాగమ్మ కూడా ఉంది. కూతురు ఎందుకు చనిపోయిందో నాగమ్మ చెప్పడం లేదు. దీంతో పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ అధారంగా ఈ కేసులో ముందుకు వెళ్లనున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-02T22:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising