ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు.. 9నెలల తర్వాత ఓ రోజు లేఖలో ఇలా రాసి.. ఆమె చేసిన పని..

ABN, First Publish Date - 2022-03-21T01:20:10+05:30

ప్రేమలు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పెళ్లి పీటల మీదకు వెళ్లే వరకూ సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం ఉండదు. కొన్ని జంటలు మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమలు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పెళ్లి పీటల మీదకు వెళ్లే వరకూ సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం ఉండదు. కొన్ని జంటలు మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. అయితే కొందరు మాత్రం ప్రేమ పెళ్లి చేసుకున్న అనంతరం సమస్యలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. సంతోషంగా జీవించకుండా లేనిపోని అపోహలతో జీవితాలను నాశనం చేసుకోవడమో, ఇంట్లోని వారికి ఇబ్బందులు సృష్టించడమో చేస్తుంటారు. కర్ణాటకలో ఓ ప్రేమ జంట ఎలాంటి సమస్యలూ లేకుండా పెళ్లి చేసుకుంది. అయితే 9నెలల తర్వాత భార్య లేఖ రాసింది. అనంతరం ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


బెంగళూరు పరిధిలోని యశ్వంతపురాలో రాకేశ్‌, విద్యాశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని తొమ్మిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో సంసారం సాఫీగా సాగేది. అయితే నెలలు గడిచే కొద్దీ రాకేశ్ ప్రవర్తనలో మాత్రం తేడా కనిపించేది. ఇష్టపడి చేసుకున్న భార్యను ప్రేమగా చూసుకోవడం మానేసి.. అనుమానించడం మొదలెట్టాడు. రోజూ ఏదో ఒక సాకు చూపి వేధిస్తుండేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతమందితో సంబంధం ఉంది.. అంటూ నిత్యం వేధించేవాడు.

బాత్‌రూంకు వెళ్లేందుకు వేచి ఉన్న మహిళ.. మరో బాత్‌రూంకు వెళ్లండంటూ తాళాలు ఇచ్చిన రైల్వేస్టేషన్‌ స్వీపర్.. చివరకు


కొన్నాళ్లు భరించిన ఆమెకు.. చివరికి ఓపిక నశించింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేఖలో ఇలా రాసింది. ‘‘నువ్వు ఎంతో మంచి వాడివని ప్రేమించాను.. కానీ నువ్వొక శాడిస్టువని పెళ్లి తర్వాత తెలిసింది.. నువ్వొక పనికిమాలిన వాడివి.. నీతో కలిసి జీవించడం కంటే.. చనిపోవడం మేలు’’.. అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..

Updated Date - 2022-03-21T01:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising