ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై అత్యాచారం.. నిందితులను చితకబాది.. సజీవంగా నిప్పంటించిన గ్రామస్తులు

ABN, First Publish Date - 2022-06-10T08:35:34+05:30

ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఆ యువకులను చితకబాది.. వారిపై కిరోసిన పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఆ యువకులను చితకబాది.. వారిపై కిరోసిన పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. గుమ్లా జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే ఒక బాలిక తన తండ్రితో కలిసి పక్క గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లింది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తరువాత తండ్రితో ఇంటికి బయలుదేరిన ఆమెకు రాత్రివేళ బస్సులు దొరకలేదు. ఆ సమయంలో ఆమె గ్రామానికే చెందిన ఇద్దరు యువకులు బైక్‌‌పై వెళుతుండగా.. వారితో వెళ్లమని ఆమె తండ్రి చెప్పాడు. ఆ ఇద్దరు యువకులు ఆమెను బైక్‌పై తీసుకొని గ్రామానికి బయలుదేరారు. కానీ మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తరువాత ఇంటికి తీసుకెళ్లారు. 


ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆ ఇద్దరు యువకులను చితకబాదారు. ఆ తరువాత వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక యువకుడు మరణించగా.. మరొక యువకుడు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నాడు.

Updated Date - 2022-06-10T08:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising