ఎన్నికల ఫలితాల వేళ గూగుల్లో ఏమి సెర్చ్ చేస్తున్నారంటే..
ABN, First Publish Date - 2022-03-10T14:08:13+05:30
ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్..
ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో యూజర్స్ పలు అంశాల గురించి వెదుకుతుంటారు. ఇప్పుడు 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు.. ‘యహీ రాత్ అంతిమ్’ (ఈ రాత్రే చివరిది) అనే పదాన్ని గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేశారు. ఈ కీవర్డ్ మాత్రమే కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ల కీవర్డ్స్ కూడా అగ్రస్థానంలో నిలిచాయి.
మూడో స్థానంలో బీజేపీ లోగో, నాలుగో నంబర్లో రాహుల్ గాంధీ ఫోటో, ఐదో స్థానంలో మాయావతి పేర్లను సెర్చ్ చేశారు. గత 24 గంటల్లో శివపాల్ సింగ్ యాదవ్ తాజా వార్తల కోసం పలువురు శోధించారు. గూగుల్ ట్రెండ్స్లో యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్లను పోల్చి చూస్తే, ఈరోజు తెల్లవారుజామున 2.26 గంటల నుండి యోగి ఆదిత్యనాథ్ కీవర్డ్ శోధనలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఉదయం వేళ ఆదిత్యనాథ్ శోధన 91 శాతంగా ఉంటే, అఖిలేష్ యాదవ్ శోధన 63 శాతంగా ఉంది. మరోవైపు నాగాలాండ్లో యూపీ సీఎం కంటే అఖిలేష్ యాదవ్ గురించే అత్యధిక అన్వేషణ కొనసాగింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ల గురించి పోటాపోటీగా సెర్చ్ జరిగింది.
Updated Date - 2022-03-10T14:08:13+05:30 IST