ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడికి షాకిచ్చిన వధువు.. మంటపంలో అతడితో కలిసి రెండు అడుగులు నడిచిన తర్వాత.. ఆమె మాటలు విని బిత్తరపోయిన అతిథులు

ABN, First Publish Date - 2022-07-08T17:58:01+05:30

వివాహానికి బంధు మిత్రులు అందరూ హాజరయ్యారు. అనుకున్నట్టుగానే పెళ్లి ఘనంగా జరుగుతోంది. పురోహితుడు మంత్రాలను ఉచ్ఛరిస్తుండగా.. వధువు, వరుడు పూల దండలు మార్చుకున్నారు. అనంతరం వరుడి చిటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వివాహానికి బంధు మిత్రులు అందరూ హాజరయ్యారు. అనుకున్నట్టుగానే పెళ్లి ఘనంగా జరుగుతోంది. పురోహితుడు మంత్రాలను ఉచ్ఛరిస్తుండగా.. వధువు, వరుడు పూల దండలు మార్చుకున్నారు. అనంతరం వరుడి చిటికెన వేలు పట్టుకుని అగ్ని హోత్రం చుట్టూ 7 అడుగులు నడిచేందుకు సిద్ధం అయింది. ఏడు అడుగుల్లో రెండు అడుగులు పూర్తి చేసింది. ఆ తర్వాత వరుడికి షాకిచ్చింది. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు విని అక్కడున్నవారంతా బిత్తరపోయారు. కాగా.. స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీతా యాదవ్, రవి యాదవ్ ఇద్దరూ ఒకరికొకరు నచ్చినట్టు చెప్పడంతో వారికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో అంగరంగ వైభంగా వివాహానికి ఏర్పాట్లు చేశారు. బంధువులు, మిత్రలు సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి తంతు ప్రారంభమైంది. ఇందులో భాగంగానే మొదటగా వరుడు, వధువు ఒకరికొకరు పూల దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత స్థానిక సంప్రదాయం ప్రకారం.. అగ్ని గుండం చుట్టూ.. ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధం అయ్యారు. ఏడు అడుగుల్లో రెండు అడుగులు కూడా పూర్తి చేసిన తర్వాత వధువు ట్విస్ట్ ఇచ్చింది. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. పెళ్లి చూపుల్లో తాను చూసింది.. ఇతడిని కాదని.. ఈ వరుడు మరీ నల్లగా ఉన్నాడంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో వివాహానికి హాజరైన అతిథులు ముక్కున వేలేసుకున్నారు. 



కూతురి ప్రవర్తనతో షాకైన వధువు తల్లిదండ్రులు.. ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆరు గంటలపాటు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ససేమిరా అంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి సందర్భంగా వధువుకు నగలను బహుమతిగా ఇచ్చామని.. వాటిని వారి నుంచి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-08T17:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising