ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో వ్యక్తి మృతదేహం.. హత్యేనని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. పోలీసులు ఆరా తీస్తే బయటపడ్డ అక్కాచెల్లెళ్ల దారుణం..!

ABN, First Publish Date - 2022-01-08T22:48:13+05:30

ఊరి చివర ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని బావిలోంచి తీయించి.. ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఊరి చివర ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని బావిలోంచి తీయించి.. ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడేమో అని భావించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అది హత్యేనని తేలడంతో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. దారుణానికి పాల్పడిన అక్కాచెల్లెళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌పూర్ ప్రాంతంలో ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతదేహం ఉందంటూ జనవరి 3న పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు మృతదేహాన్ని బయటకు తీయించి.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తిని ముఖేష్‌గా గుర్తించారు. అంతేకాకుండా ముఖేష్ ప్రమాదవశాత్తు బావిలోపడి చనిపోయి ఉంటాడని తొలుత పోలీసులు భావించారు. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వత వారికి అసలు విషయం తెలిసింది. ముఖేష్‌ను కొట్టి చంపేసి, ఆ తర్వాత బావిలో పడేసినట్టు తేలడంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. 



రాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కొన్నేళ్ల క్రితం వివాహం అయినట్టు పేర్కొన్నారు. అయితే ఏడాది క్రితం ఆ అక్కాచెల్లెళ్లను తమ భర్తలు వదిలేయడంతో.. వారిద్దరూ ముఖేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వెల్లడించారు. కొద్ది రోజులుగా ముఖేష్ మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి.. దారుణానికి పాల్పడ్డట్టు చెప్పారు. మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను కర్రలతో కొట్టి చంపి.. ఆ తర్వాత మృతదేహాన్ని బావిలో పడేసినట్టు వివరించారు. 




Updated Date - 2022-01-08T22:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising