ముగ్గురు ఆడే చదరంగం గురించి మీకు తెలుసా? దీనిని ఎలా ఆడుతారంటే...
ABN, First Publish Date - 2022-10-13T13:33:25+05:30
చదరంగం ఆడేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయనే...
చదరంగం ఆడేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. కొన్ని ఆటల నియమాలు కాలక్రమేణా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి చదరంగం ఆడటాన్ని మీరు చూసే ఉంటారు అయితే రాబోయే కాలంలో ముగ్గురు ఆటగాళ్లు చెస్ ఆడే దృశ్యాన్ని మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఐఐటీ రూర్కీలో బీటెక్ బీటెక్ చదువుకున్న ఆదిత్య నిగమ్ తన గేమింగ్ స్టార్టప్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో చెస్ ఆడగలిగే కొత్త చెస్ బోర్డ్ను అభివృద్ధి చేశారు.
దీనిని ట్రివిజార్డ్ చెస్ అంటారు. ఐఐటీ రూర్కీలో జరిగిన ఒక చెస్ టోర్నమెంట్ సందర్భంగా ఆదిత్య నిగమ్ ఈ ట్రైవిజార్డ్ చెస్ని పరిచయం చేశారు. ఈ కొత్త ట్రివిజార్డ్ చెస్ బోర్డ్ గురించి ఆదిత్య మాట్లాడుతూ చెస్ నియమాలలో ఎటువంటి మార్పులు చేయలేదని అన్నారు. ఆట మునుపటిలా ఆడవచ్చన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరికి బదులుగా ముగ్గురు ఆటగాళ్ళు ఈ గేమ్ను ఏకకాలంలో ఆడగలరన్నారు. అలాగే ఆట ఆడే ప్రతి క్రీడాకారుడు ఒకే సంఖ్యలో పావులను కలిగి ఉంటాడన్నారు. యువతరంలో చెస్ను ప్రోత్సహించడమే ఈ గేమ్ ఉద్దేశమని ఆదిత్య చెప్పారు. ఈ కొత్త ఫార్మాట్లో ఆటగాళ్ల సంఖ్య పెరిగింది. ఇది మొత్తం ఆట తీరుతెన్నులను మార్చివేస్తుంది. ఈ గేమ్లోని ముగ్గురు ఆటగాళ్లలో ప్రతి క్రీడాకారుడు ఏకకాలంలో ఇద్దరు ఇతర ఆటగాళ్ల కదలికలను అర్థం చేసుకోవాలి. ట్రివిజార్డ్ చెస్లో ఆటగాళ్ల పందెం సవ్యదిశలో సాగుతుంది. మొదట తెలుపు, ఆ తర్వాత గోధుమరంగు ఆపై నలుపు రంగు గెలుస్తుంది. మూడవ ఆటగాడి పావులు గోధుమ రంగులో ఉంటాయి.
Updated Date - 2022-10-13T13:33:25+05:30 IST