ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త మంచంపై ఉండగానే.. పక్కన ప్రియుడితో సరదా కబుర్లు చెబుతున్న భార్య.. చివరకు వెలుగులోకి వచ్చిన అసలు విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-09-15T02:03:43+05:30

సాటి మనిషి ఆపదలో ఉన్న సమయంలో సరదాగా ఉండాలని ఏ మనిషికీ అనిపించదు. కానీ కొందరు శాడిస్టులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇటీవల కొందరు మహిళల్లో...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాటి మనిషి ఆపదలో ఉన్న సమయంలో సరదాగా ఉండాలని ఏ మనిషికీ అనిపించదు. కానీ కొందరు శాడిస్టులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇటీవల కొందరు మహిళల్లో కూడా ఇలాంటి క్రూర స్వభావం బయటపడుతోంది. వివాహేతర సంబంధాలకు (Extramarital affairs) అలవాటు పడి.. వాటిని కొనసాగించాలనే ఉద్దేశంతో చివరకు సొంత భర్తను, పిల్లలను కూడా చంపడానికి వెనుకాడడం లేదు. బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. భర్త మంచంపై బాధపడుతుండగా.. పక్కనే.. భార్య తన ప్రియుడితో సరదాగా కబుర్లు చెబుతోంది. ఇద్దరూ కలిసి చేసిన కుట్ర తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) సీతామర్హి జిల్లా పుప్రి పరిధి దుమ్హర్‌పట్టి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో అజయ్ కుమార్‌, పుతుల్ కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమైనప్పటి నుంచి సంతోషంగా ఉన్న వీరి కుటుబంలో ఏడాది నుంచి సమస్యలు తలెత్తాయి. పులుల్ కుమారికి స్థానిక ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. భర్తకు తెలీకుండా అతడితో ప్రేమాయణం (love with boyfriend) సాగించింది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. అయినా పుతుల్ కుమారి మాత్రం తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఎలాగైనా ప్రియుడితోనే జీవితాంతం ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంది.

చనిపోయిందనుకుని తలుపులు వేసి పారిపోయిన భర్త... స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా..


ఇద్దరూ కలిసి అజయ్ కుమార్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. కేసు తమ మీదకు రాకుండా భోజనంలో విషం (poison) ఇచ్చి చంపాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తర్వాత కాసేపటికే అజయ్‌కి తల తిరగడం మొదలైంది. చూస్తుండగానే పరిస్థితి మరింత విషమించింది. విపరీతమైన బాధతో మంచంపై భర్త అల్లాడిపోతుంటే.. మరోవైపు పక్కనే, భార్య తన ప్రియుడితో సరదాగా కబుర్లు చెబుతోంది. చివరకు తల్లిదండ్రులు గమనించి అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అజయ్‌కి ప్రాణాపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..



Updated Date - 2022-09-15T02:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising