ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వు అందంగా లేవు.. నచ్చలేదంటూ భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త.. పెళ్లయిన ఏడాది తర్వాత..

ABN, First Publish Date - 2022-04-22T15:31:37+05:30

వారిద్దరి ప్రేమకు ఫేస్‌బుక్ వేదిక అయింది. చాటింగ్‌లతో మొదలైన వారి పరిచయం.. కొన్నాళ్లకు ప్రేమగా మారి, ఇద్దరినీ దగ్గరికి చేసింది. బాగా చూసుకుంటానని మాటివ్వడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరి ప్రేమకు ఫేస్‌బుక్ వేదిక అయింది. చాటింగ్‌లతో మొదలైన వారి పరిచయం.. కొన్నాళ్లకు ప్రేమగా మారి, ఇద్దరినీ దగ్గరికి చేసింది. బాగా చూసుకుంటానని మాటివ్వడంతో బాలిక అతడిని నమ్మింది. మైనర్ కావడంతో ఎవరికీ తెలీకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. సంసారం సాఫీగా నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. నువ్వు అందంగా లేవు.. నచ్చలేదంటూ భర్త ఇంటి నుంచి గెంటేశాడు. చివరకు ఈ విషయం చాలా దూరం వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం బగల్‌పూర్‌కు చెందిన నిరంజన్ కుమార్‌కు ఏడాది క్రితం 14ఏళ్ల బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. అతడి మాయమాటలను బాలిక నమ్మి.. రోజూ ఫోన్లలో కూడా మాట్లాడుతుండేది. పెళ్లి చేసుకుని, బాగా చూసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరైంది. ఆమె మైనర్ కావడంతో ఎవరికీ తెలియకుండా గుడిలో వివాహం చేసుకుని, తన ఇంటికి తీసుకెళ్లాడు. మొదట్లో భర్తతో పాటూ అత్తమామలు కూడా ఆమెను బాగా చూసుకునేవారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల అవి ఇంకా ఎక్కువయ్యాయి.  భర్తతో పాటూ అత్తమామలు కూడా ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు.

గుర్రంపై ఊరేగింపునకు సిద్ధమైన వరుడు.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. అసలు నిజం తెలిసి వధువుకు షాక్..!


నెల క్రితం భర్త ఆమెతో ‘‘నువ్వు అందంగా లేవు.. నాకు నచ్చలేదు’’.. అంటూ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా రోడ్డున పడింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో చిన్నప్పటి నుంచి సోదరితో కలిసి పెరిగింది. దీంతో సోదరి వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పుకొంది.  అయితే అక్కడ కూడా ఆమెకు అవమానాలు ఎదురవడంతో గురువారం రైలు ఎక్కి పూర్ణియ అనే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ  ఓ జర్నలిస్టు ఆమెను విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చైల్డ్ లైన్ బృందం సభ్యులు ఆమెతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఆమెకు న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. బాలికకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

ప్రియుడు అడిగాడని స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది... ఎలాగైనా కలవాలంటూ కొన్నాళ్ల తర్వాత అతడి నుంచి మెసేజ్.. తీరా చూస్తే..

Updated Date - 2022-04-22T15:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising