ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది అద్భుత ఆలయం.. పాక్ యుద్ధ బాంబులు సైతం ఇంచి కదపలేకపోయాయి.. ఎక్కడుందంటే..

ABN, First Publish Date - 2022-02-21T17:18:37+05:30

భారతదేశంలో అనేక అద్భుత దేవాలయాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలో అనేక అద్భుత దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో ఆసక్తికర గాథలు దాగివున్నాయి. అయితే వీటన్నింటికీ మించిన ఆలయం ఒకటుంది. అది దేశ భద్రత ఉదాహరణగా నిలిచింది. ఈ ఆలయంలో పూజలను కూడా నైనికులే నిర్వహించడం విశేషం. ఈ ఆలయం భారత్ -పాక్ యుద్ధ సమయంలో అద్భుతాలకు నిలయంగా మారింది. అదే జైసల్మేర్‌లోని తనోత్ మాత ఆలయం. ఈ ఆలయంలో పూజాకార్యక్రమాలను BSF నిర్వహిస్తుంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ఆదరణ పొందుతోంది. ఆలయంలో అటువంటి అద్భుతాలు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుండి 130 కి.మీ దూరంలో ఉంది, ఆలయంలో కొలువైన అమ్మవారిని తనోత్ మాత లేదా అవద్ మాత అని పిలుస్తారు. తనోత్ మాత హింగ్లాజ్ మాత ప్రతి రూపమని నమ్ముతారు. భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఈ ఆలయంలో అద్భుతాలు కనిపించాయి. అది.. సెప్టెంబర్ 1965..  తనోట్‌ ఆలయంపై దాడి చేయడానికి ముందు, శత్రువులు తూర్పున కిషన్‌గఢ్ నుండి బుయిలి వరకు 74 కిలోమీటర్లు, పశ్చిమాన సధేవాలా నుండి షాఘర్ వరకు మరియు ఉత్తరాన అచ్రి టిబా నుండి ఆరు కిలోమీటర్ల వరకు ఆక్రమించారు.


తనోత్ ఆలయం చుట్టూ మూడు దిక్కులు ఉన్నాయి. శత్రువులు తనోత్‌ను స్వాధీనం చేసుకున్నట్లయితే, వారు రామ్‌ఘర్ నుండి షాఘర్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. అందుకే తనోట్ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం ఇరు సైన్యాలకు ముఖ్యమైనదిగా మారింది. 1965 నవంబర్ 17 నుండి 19 వరకు, పాకిస్తాన్ మూడు వేర్వేరు దిశల నుండి తనోట్‌పై భారీ దాడిని చేసింది.  తనోత్ మాత ఆలయ పరిసరాల్లో శత్రువులు సుమారు మూడు వేల తూటాలు పేల్చారు. అయితే చాలా తూటాలు లక్ష్యాన్ని తప్పిపోయాయి. ఒక్క గుడినే లక్ష్యంగా చేసుకుని దాదాపు 450 తూటాలు పేల్చారు. అయితే అద్భుతంగా ఒక్క తూటా కూడా లక్ష్యాన్ని తాకలేదు, గుడి ఆవరణలో పడిన బుల్లెట్ ఒక్కటి కూడా పేలలేదు. ఆలయం ఏమాత్రం చెక్కు చెదరలేదు.. నేటికీ ఈ ఆలయంలో చాలా తూటాలు కనిపిస్తాయి. 1965 యుద్ధం తరువాత, సరిహద్దు భద్రతా దళం ఇక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలను సరిహద్దు భద్రతా దళానికి చెందిన ట్రస్ట్ చేపట్టింది. ఆలయంలో మ్యూజియం కూడా ఉంది. దానిలో పాకిస్తాన్ సైన్యం విసిరిన.. పేలని బాంబులను సందర్శకుల  కోసం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-02-21T17:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising