కళ్లజోడు, నెత్తిమీద టోపీ పెట్టుకుని అమాయకంగా కనిపిస్తున్నాడు కదూ.. కానీ జరిగిన దారుణమేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2022-04-09T21:36:41+05:30
కళ్లజోడు, నెత్తిమీద టోపీ పెట్టుకుని పోలీసుల మధ్య నిల్చున్న ఈ వ్యక్తి చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నాడు కదూ. కానీ జరిగిన దారుణం ఏంటే తెలిస్తే నోరెళ్లబెడతారు. పార్కులో ఉంటున్నాడని తెలిసి
ఇంటర్నెట్ డెస్క్: కళ్లజోడు, నెత్తిమీద టోపీ పెట్టుకుని పోలీసుల మధ్య నిల్చున్న ఈ వ్యక్తి చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నాడు కదూ. కానీ జరిగిన దారుణం ఏంటే తెలిస్తే నోరెళ్లబెడతారు. పార్కులో ఉంటున్నాడని తెలిసి నచ్చజెప్పేందుకు వెళ్లిన కన్న తల్లినే అత్యంత క్రూరంగా హత్య చేసిన కసాయి కొడుకు ఇతడు. కాగా.. స్థానికంగా హాట్ టాపిక్గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్లోని శివపురి ప్రాంతానికి చెందిన మనీష్కు కొద్ది కాలం క్రితమే ఓ మహిళతో పెళ్లైంది. పెళ్లైన కొత్తలో ఆ దంపతులు ఇద్దరూ బాగానే ఉండేవారు. తాజాగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో తరచూ వారిద్దరూ గొడవపడేవారు. తాజాగా మనీష్ తన భార్యతో గొడవకు దిగాడు. మనీష్ వైఖరితో ఇబ్బంది పడ్డ కుటుంబ సభ్యులు అతడిలో మార్పు రావాలని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మనీష్.. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివసించడం మొదలుపెట్టాడు. అనంతరం ఆ ఇంటి నుంచి కూడా బయటికొచ్చిన అతడు.. పార్కులోనే జీవనం సాగిస్తున్నాడు. అది తెలిసి అతడి తల్లి బీనా బండారీ తల్లడిల్లిపోయింది.
కొడుకు నచ్చజెప్పేందుకు అతడి వద్దకు వెళ్లింది. అయితే భార్యపై కోపంతో ఊగిపోతున్న మనీష్ ఆమె చెప్పిన మాటలను వినిపించుకోలేదు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసుకుని ఉన్న పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. మెడ, ఛాతి భాగంలో పలుమార్లు బలంగా పొడిచి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బీనా బండారీ.. తీవ్ర రక్తస్త్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెపై మనీష్ దాడి చేస్తున్న సమయంలో పార్కులో అనేక మంది ఉన్నప్పటికీ అతడిని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. కాగా.. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొద్ది గంటల్లోనే మనీష్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Updated Date - 2022-04-09T21:36:41+05:30 IST