ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భవతిని కాటేసిన పాము.. పెళ్లయిన మూడేళ్లకు సంతానం కలగబోతోందని ఆనందంలో తేలియాడుతుంటే చివరికి జరిగిన ఘోరమిదీ..!

ABN, First Publish Date - 2022-09-25T17:51:06+05:30

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలోగల బరాగావ్ ప్రాంతంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలోగల బరాగావ్ ప్రాంతంలో ఓ గర్భిణి పాముకాటుకు బలయ్యింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భర్త గుజరాత్ నుండి ఇంటికి వస్తాడని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. బరాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనోరా గ్రామానికి చెందిన రాజు చౌహాన్‌కు జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మనీషా చౌహాన్ (30)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రాజు చౌహాన్ గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 


కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనీషా గర్భవతి. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తరువాత మనీషా పాత్రలు కడగడానికి ఉపక్రమించింది. అదే సమయంలో ఆమెను ఒక విషసర్పం కాటేసింది. మనీషా కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె భర్త రాజుకు తెలియజేసిన అనంతరం కుటుంబ సభ్యులు మనీషా మృతదేహంతో ఇంటికి చేరుకున్నారు. శనివారం, గ్రామస్తుల సలహా మేరకు, కుటుంబ సభ్యులు మనీషా మృతదేహాన్ని ఘాజీపూర్‌లోని ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారు, అయితే అక్కడ కూడా ఆమె చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి భర్త రాజు గుజరాత్‌ నుంచి ఇక్కడకు రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.  

Updated Date - 2022-09-25T17:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising