ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime: నడిరోడ్డు మీద పడి ఉన్న మూట.. దానిలో ఏముందో చూసి నివ్వెరపోయిన స్థానికులు.. పోలీసులు కూడా షాక్..!

ABN, First Publish Date - 2022-08-13T20:25:10+05:30

శుక్రవారం ఉదయం ఏడు గంటలు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్ లఖీంపుర మెయిన్ రోడ్డు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శుక్రవారం ఉదయం ఏడు గంటలు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్ లఖీంపుర మెయిన్ రోడ్డు.. రోడ్డు మధ్యలో ఏదో మూట పడి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. దానిని ఓపెన్ చేసి చూడగా లోపల ఓ యువతి మృతదేహం ఉంది.. నివ్వెరపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మూటలోని మృతదేహాన్ని బయటకు తీసి షాకయ్యారు.. ఎందుకంటే తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఆ మూటలో ఉంది.. మీరట్‌లో ఈ తరహా కేసు ఈ మధ్య కాలంలో ఇది మూడోది కావడం విషాదకరం. 


ఇది కూడా చదవండి..

Cat saves toddler: చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన పిల్లి.. వీడియో వైరల్!


ఆ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. ఇదే తరహాలో జులై 6వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు మీరట్‌లోని దోగ్రా ఆలయం పక్కన కాలువలో ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ యువతి మృతదేహానికి కూడా తల లేదు. ఆ మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులే ఖననం చేశారు. అలాగే 2020 అక్టోబర్ 26న కూడా ఓ యువతి మృతదేహం ఇదే స్థితిలో లభ్యమైంది. 


మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసేసి గోనె సంచిలో వేసి కుట్టేశారు. ఆ మూటలో కూడా తల లేదు. ఆ కేసుకు ఇప్పటి రెండు ఘటనలకు సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సీరియల్ కిల్లింగ్స్ స్థానికుల్లో భయాందోళనలు రేపుతున్నాయి. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2022-08-13T20:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising