ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elderly couple: 75 ఏళ్ల వయసులో తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు...పండంటి బిడ్డకు జననం

ABN, First Publish Date - 2022-08-10T15:13:33+05:30

పెళ్లి అయిన 54 ఏళ్ల తర్వాత వృద్ధ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్(రాజస్థాన్): పెళ్లి అయిన 54 ఏళ్ల తర్వాత వృద్ధ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది. 75ఏళ్ల గోపిచంద్, 70 ఏళ్ల చంద్రావతి దేవీలు రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును గ్రామంలో నివాసం ఉంటున్నారు. గోపిచంద్, చంద్రావతి దేవిలకు వివాహమై 54 ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టలేదు. ఈ దంపతులు పిల్లల కోసం పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. ఏడాదిన్నర క్రితం చివరిగా ఈ వృద్ధ దంపతులు అల్వార్ నగరంలోని ఇండో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ సెంటరును సంప్రదించారు.


ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సాంకేతిక సహాయంతో గోపిసింగ్, చంద్రావతి దేవి వృద్ధ దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. వృద్ధదంపతులకు బిడ్డ పుట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవని ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ పంకజ్ గుప్తా చెప్పారు.గోపిసింగ్ మాజీ సైనికుడని, ఇతను బంగ్లాదేశ్ యుద్ధంలో కాలికి గాయమైందని డాక్టర్ పంకజ్ చెప్పారు.తల్లి చంద్రావతి దేవి,బిడ్డ క్షేమంగా ఉన్నారు. చంద్రావతి మూడో సారి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిందని డాక్టర్ చెప్పారు. 


తల్లికి వృద్ధాప్యం వల్ల మేం కాన్పు గురించి భయపడ్డామని, కాని సోమవారం చంద్రావతి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.బిడ్డ బరువు 3.5 కిలోలని డాక్టర్ పేర్కొన్నారు. చంద్రావతి దేవికి సీజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యుడు కల్నల్ రీనా యాదవ్ కూడా మాజీ సైనికుడు కావడం విశేషం. 


Updated Date - 2022-08-10T15:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising