స్కూలులో ప్రిన్సిపాల్, టీచర్ రాసలీలలు.. గ్రామస్థులను చూసి ఒక్కసారిగా షాక్..!
ABN, First Publish Date - 2022-02-24T18:55:02+05:30
వారిద్దరూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన వారు.. తమ బోధనలతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన వారు..
వారిద్దరూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన వారు.. తమ బోధనలతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన వారు.. అలాంటిది వారే అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు.. పాఠశాలలోనే కామ కలపాలు సాగించారు.. విద్యార్థులు, గ్రామస్థులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.. సస్పెండ్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్కు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
జోధ్పూర్కు సమీపంలోని పాంపన్ అనే గ్రామంలోని పాఠశాలలో ధర్మపాల్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. అతనికి అదే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరూ స్కూలులోనే శృంగార కలాపాలు సాగించేవారు. ఈ విషయం విద్యార్థుల ద్వారా గ్రామస్థులకు తెలిసింది. వారం రోజుల క్రితం ఇద్దరూ పాఠశాల వెనకాల ఓ గదిలో శృంగారం సాగిస్తుండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పాఠశాలలో వారి శృంగారం గురించి గ్రామ సర్పంచ్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఐదు రోజుల పాటు ఇద్దరిపైనా చర్యలు తీసుకోలేదు. విషయం స్థానిక ఎమ్మెల్యే వరకు వెళ్లడంతో ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ సస్పెండ్ చేసిన విద్యాధికారి విచారణకు ఆదేశించారు.
Updated Date - 2022-02-24T18:55:02+05:30 IST