ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడప్రభు కెంపేగౌడ ఎవరు? ఈయన భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

ABN, First Publish Date - 2022-07-04T13:13:45+05:30

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. ఇది మాత్రమే కాదు ఇక్కడి అసెంబ్లీలో కూడా నాడప్రభు మరొక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఇంతకీ నాడప్రభు కెంపేగౌడ ఎవరు? బెంగుళూరుతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


నాడప్రభు కెంపేగౌడను బెంగళూరు వ్యవస్థాపకుడని అంటారు. 1513లో విజయనగర సామ్రాజ్య రాజు నాదప్రభు పాలన ప్రారంభమైంది. సుమారు 56 సంవత్సరాలు ఇక్కడ పాలించారు. 1537లో బెంగుళూరును రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారు. నాడప్రభువు హయాంలో నగరంలో వేయికి పైగా చెరువులను నిర్మించి ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి నీటి కొరత లేకుండా చేశారు. ఈ నేపధ్యంలోనే అతని ఘనత గుర్తించి నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్‌కు కూడా అతని పేరు పెట్టారు. పాత నగరంలో కెంపేగౌడ పేరు మీద ఒక రహదారి కూడా ఉంది. బెంగళూరు విమానాశ్రయంలో ఆవిష్కరించనున్న కెంపేగౌడ విగ్రహం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. విమానాశ్రయంలోని 23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన హెరిటేజ్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-04T13:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising