ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ఆమెపై యాసిడ్ పోసి ఎక్కడికి తీసుకెళ్లాడంటే.. చివరకు

ABN, First Publish Date - 2022-04-14T08:31:14+05:30

అనుమానం పెనుభూతం అంటారు.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి తెగించాడు.. ఆమెపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన భార్యను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పారిపోయాడు.. ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానం పెనుభూతం అంటారు.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి తెగించాడు.. ఆమెపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన భార్యను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పారిపోయాడు.. ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన జ్యోతిష్ మండల్ అనే వ్యక్తి వృత్తి రీత్యా బట్టల వ్యాపారి. అతనికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన నాటి నుంచి అతను భార్యను అనుమానిస్తూనే ఉన్నాడు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అంటూ తరచుగా గొడవ పడేవాడు. ఆ అనుమానం రోజురోజుకూ మరింత పెరిగింది. దీంతో ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. 


ఆమె మొహంపై యాసిడ్ పోసేశాడు. అనంతరం ఆమెను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పరారైపోయాడు. దాడిలో ఆ మహిళ మొహం అంతా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-14T08:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising