ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య ఉండగా మరదలితో సంబంధం.. మరో యువతితో కూడా వివాహం.. చివరికి ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-21T05:43:34+05:30

ఎంతగానో ప్రేమించే భార్య ఉండగా.. ఒక యువకుడు తన మరదలి(భార్య చెల్లెలు)తో సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలం తరువాత భార్యను వదిలేసి మరదలితో కాపురం పెట్టాడు. భార్యపై ఒత్తిడి చేసి ఆమెను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంతగానో ప్రేమించే భార్య ఉండగా.. ఒక యువకుడు తన మరదలి(భార్య చెల్లెలు)తో సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలం తరువాత భార్యను వదిలేసి మరదలితో కాపురం పెట్టాడు. భార్యపై ఒత్తిడి చేసి ఆమెను తన రెండో వివాహానికి ఒప్పించాడు. అలా మరదిలితో వివాహం జరిగిన కొంతకాలం తరువాత ఆ యువకుడికి తన రెండో 


భార్య(మరదలు)తో గొడవలు జరిగేవి. దీంతో అతను తన రెండో భార్యను హత్య చేసి వేరే రాష్ట్రానికి పారిపోయాడు. అక్కడ కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అతడికి తన గతం వెంటాడింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్ నగరంలో నివసించే సంజయ్ ప్రతాప్ అనే యువకుడు 2003లో మంజు అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత అతను తన మరదలు ప్రీతిని ప్రేమించాడు. ఒకరోజు భార్యాపిల్లలను వదిలేసి సంజయ్ తన మరదలితో పారిపోయాడు. మరదలిని పెళ్లిచేసుకొని వేరే నగరంలో 


కాపురం పెట్టాడు. ఆ తరువాత తన మొదటి భార్య మంజుని తన రెండో భార్యతో కలిసి ఉండాలని ఒత్తిడి చేశాడు. దానికి మంజు తన పిల్లల కోసం ఒప్పుకుంది. 2007లో సంజయ్ ఒక మార్కెటింగ్ కంపెనీ స్థాపించి బాగా ఎదిగాడు. తన వ్యాపారంలో రెండో భార్య ప్రీతిని పార్టనర్‌గా చేర్చుకున్నాడు. ఈ క్రమంలో 2016 సంవత్సరంలో ప్రీతి 


మరొక యువకుడిని ప్రేమించిందని సంజయ్‌కు తెలిసింది. ఈ విషయంలో సంజయ్, ప్రీతి మధ్య గొడవలు జరిగేవి.  ఆ గొడవలు పెరిగి ఒకరోజు సంజయ్ తన రెండో భార్య ప్రీతిని హత్య చేశాడు. ఆ తరువాత ఏం చేయాలో తెలియక తన మొదటి భార్యకు జరిగిన విషయం వివరించి.. మీరట్ నగరం వదలి పంజాబ్ పారిపోయాడు. పంజాబ్‌లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంత కాలం తరువాత 2019 అక్కడ మరో యువతి కీర్తిని పెళ్లిచేసుకున్నాడు.


ప్రీతి హత్య కేసుని విచారన చేస్తున్న పోలీసులకు సంజయ్ దుబాయ్‌కి పారిపోయాడని అతని మొదటి భార్య మంజు చెప్పింది. కానీ 2021 డిసెంబరులో పోలీసులకు సంజయ్ గురించి కీలక సమాచారం లభించింది. పోలీసులు మంజు ఫోన్ రికార్డుల ద్వారా సంజయ్ ఆచూకీ తెలుసుకొని అతడిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-02-21T05:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising