Shocking: బ్రష్ చేయకుండా ముద్దు వద్దన్న భార్య.. ఆ భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..
ABN, First Publish Date - 2022-07-02T00:37:20+05:30
పళ్లు తోముకోకుండా కొడుకును ముద్దు పెట్టుకోవద్దని చెప్పినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త దారుణానికి ఒడిగట్టాడు.
పళ్లు తోముకోకుండా కొడుకును ముద్దు పెట్టుకోవద్దని చెప్పినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త దారుణానికి ఒడిగట్టాడు. కొడుకు ముందే భార్యను కొడవలితో నరికి చంపేశాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని మన్నార్కాడ్లో ఈ దారుణ ఘటన జరిగింది. మన్నార్కాడ్కు చెందిన అవినాష్ అనే యువకుడికి 2019లో దీపిక అనే మహిళతో వివాహం జరిగింది. అవినాష్కు ఇది రెండో వివాహం. మొదటి భార్యతో విభేదాలు రావడంతో ఆమెకు విడాకులిచ్చిన అవినాష్.. దీపికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు.
ఇది కూడా చదవండి..
ముసలోడే కానీ మహానుభావుడు.. కొడుకు మాజీ లవర్తో ప్రేమాయణం.. చివరకు..
గత మంగళవారం ఉదయం అవినాష్ నిద్ర లేవగానే తన కొడుకును ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికి అవినాష్ ఇంకా పళ్లు తోముకోకపోవడంతో దీపిక అడ్డు చెప్పింది. బ్రష్ చేసిన తర్వాత ముద్దు పెట్టుకోవాలని చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అవినాష్ భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తట్టుకోలేకపోయిన అవినాష్ కొడవలి తెచ్చి కొడుకు ముందే దీపికపై దాడి చేశాడు. ఆమె మెడ, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి చూశారు.
అప్పటికే దీపిక రక్తపు మడుగులో పడి ఉంది. కొడుకు ఆమెను పట్టుకుని ఉన్నాడు. దీపికను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో దీపిక మరణించింది. స్థానికులు అవినాష్ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Updated Date - 2022-07-02T00:37:20+05:30 IST