క్రాసింగ్ దగ్గర రైలును ఆపిన డ్రైవర్.. ఎందుకు ఆపాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం!
ABN, First Publish Date - 2022-02-22T22:53:47+05:30
అదొక క్రాసింగ్ జంక్షన్.. రైలు వెళ్లిపోతే పట్టాలు దాటుదామని చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు..
అదొక క్రాసింగ్ జంక్షన్.. రైలు వెళ్లిపోతే పట్టాలు దాటుదామని చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. అయితే ఆ క్రాసింగ్ దగ్గరకు రాగానే ఆ రైలు ఆగిపోయింది.. రైలు డ్రైవర్ (లోకో పైలెట్) అక్కడ కచోరీలు కొనుక్కొని తాపీగా రైలును స్టార్ట్ చేశాడు.. కచోరీల కోసం ఏకంగా రైలునే ఆపడం వైరల్గా మారింది.. చుట్టుపక్కల ఉన్నవారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. రాజస్థాన్లోని అళ్వార్లో ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్లోని అళ్వార్లో ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర ఓ వ్యక్తి కచోరీలు ఉన్న సంచి పట్టుకుని నిల్చున్నాడు. రైలు నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగింది. లోకో పైలెట్ కచోరీలు తీసుకుని, డబ్బులు ఇచ్చిన తర్వాత కదిలింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. నిజానికి అలాంటి క్రాసింగ్ల దగ్గర రైలును ఆపడం నిషిద్ధం. దీంతో ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు అదేశించినట్టు సమాచారం. లోకో పైలట్, స్టేషన్ సూపరింటెండెంట్ సహా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Updated Date - 2022-02-22T22:53:47+05:30 IST