Viral Video: బ్రెజిల్లో విషాద ఘటన.. కొండచరియలు విరిగిపడి పర్యాటకులు మృతి
ABN, First Publish Date - 2022-01-11T10:57:51+05:30
బ్రెజిల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది కనపడకుండా పోగా.. 32 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన బ్రెజిల్లోని లేక్ ఫర్నేస్...
బ్రెజిల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది కనపడకుండా పోగా.. 32 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన బ్రెజిల్లోని లేక్ ఫర్నేస్ వద్ద శనివారం జరిగింది.
వీకెండ్ కావడంతో కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో షికారు చేస్తూ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు. ఇంతలో ఓ పెద్ద రాతి పలక వచ్చి బోట్ల మీద పడింది. ఈ హఠాత్ పరిణామంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. తప్పిపోయిన వారికోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సమీపంలోని పర్యాటకులు రికార్డ్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Updated Date - 2022-01-11T10:57:51+05:30 IST