ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.500 కోసం గొడవ.. రోడ్డు మీదే కొట్టుకున్న మహిళలు.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-10T15:17:46+05:30

ఆ మహిళలిద్దరూ రూ.500 కోసం గొడవ పెట్టుకున్నారు.. రోడ్డు మీదే కొట్టుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళలిద్దరూ రూ.500 కోసం గొడవ పెట్టుకున్నారు.. రోడ్డు మీదే కొట్టుకున్నారు.. ఆ క్రమంలో ఒక మూడు నెలల పాప ప్రాణాలు కోల్పోయింది.. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాకు చెందిన సావన్ నర్రే అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే హేమంత్ బవేరియా అనే వ్యక్తికి ఇటీవల రూ.2000 అప్పు ఇచ్చాడు. మూడ్రోజుల అనంతరం హేమంత్ రూ.1500 తిరిగి ఇచ్చేశాడు. మిగతా రూ.500 తర్వాత ఇస్తానని చెప్పాడు. 


ఎంతకీ ఆ రూ.500 తిరిగి ఇవ్వకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ ప్రారంభమైంది. సావన్ భార్య బేడియా బాయి మంగళవారం సాయంత్రం హేమంత్ భార్య రసబాతి దగ్గరకు వచ్చి రూ.500 గురించి అడిగింది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. ఆ సమయంలో రసబాతి తన మూడు నెలల పాపను ఎత్తుకుని ఉంది. ఆ తోపులాటలో ఆ మూడు నెలల చిన్నారి కింద పడి తీవ్ర గాయాలపాలైంది. 


ఆ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మరణించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బేడియా బాయి, సావన్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-10T15:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising