ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఇద్దరు యువకులు.. ఆ పిల్ల నాదంటే నాదంటూ గొడవ.. చివరికి పోలీసులు ఆమె గురించి చెప్పింది విని..

ABN, First Publish Date - 2022-07-10T20:11:09+05:30

మధ్యతరగతికి చెందిన ఇద్దరు యువకులు.. జీవితంలో ఉన్నతంగా బతకాలని భావించారు. ఈ క్రమంలో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అనంతరం పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇతంలో వారికి ఓ విషయం తెలిసిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మధ్యతరగతికి చెందిన ఇద్దరు యువకులు.. జీవితంలో ఉన్నతంగా బతకాలని భావించారు. ఈ క్రమంలో కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అనంతరం పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇతంలో వారికి ఓ విషయం తెలిసింది. తామిద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు గ్రహించారు. దీంతో గొడవకు దిగారు. ఆ పిల్ల నాదంటే నాదంటూ కొట్టుకున్నారు. చివరికి పోలీసులు ఎంట్రీతో షాకింగ్ విషయం బయటపడింది. అధికారులు చెప్పింది విని ఆ యువకుల మైండ్ బ్లాంక్ అయింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని జగత్‌పురా ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కొద్ది రోజులగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. తామిద్దరం ప్రేమించేది ఒకరినే అనే విషయం తాజాగా బయటపడింది. దీంతో ఇద్దరూ కొట్లాటకు దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. ఇద్దరినీ అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో యువతికి సంబంధించి షాకింగ్ విషయం బయటపడింది. సదరు యువతికి.. ఈ ఇద్దరు యువకులతో సంబంధం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఆ యువతి.. ఇద్దరితో సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో తమ ప్రేయసి గురించి పోలీసులు చెప్పింది విని సదరు యువకులు విస్తుపోయారు. 


Updated Date - 2022-07-10T20:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising