ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిగ్గా నెల రోజుల క్రితం పెళ్లి.. కొత్త కోడలికి టీ చేసి ఇచ్చిన అత్త.. క్షణాల్లోనే ఇంట్లో ఊహించని సీన్..!

ABN, First Publish Date - 2022-06-14T17:56:37+05:30

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ తర్వాతే యువకుడి అసలు స్వరూపం బయటపడింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ తర్వాతే యువకుడి అసలు స్వరూపం బయటపడింది.. కట్నం తీసుకురమ్మని భార్యను వేధించడం ప్రారంభించాడు.. భర్త వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.. భార్యను ఆ భర్త ఇంటికి తీసుకెళ్లాడు.. తర్వాతి రోజు ఉదయం కోడలికి అత్త టీ ఇచ్చింది.. ఆ టీ తాగిన కోడలు తీవ్ర అస్వస్థతకు గురైంది.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది.. భర్త, మామ, అత్త కలిసి తను తాగే టీలో విషం కలిపినట్టు చనిపోయే ముందు ఓ వీడియో రూపొందించింది. 


ఇది కూడా చదవండి..

నిద్రపోతున్న భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. 10 గంటల్లోనే షాకింగ్ విషయం బయటపెట్టిన పోలీసులు..!


ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన అజార్, ఫర్జానా అనే యువతీయువకులు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు. ఫర్జానా, అజార్ తమ తమ ఇళ్లలో పెళ్లి గురించి మాట్లాడి పెద్దలను ఒప్పించారు. గత నెల 14వ తేదీన వీరి వివాహం జరిగింది. ఫర్జానా తండ్రి చనిపోవడంతో తల్లే తన శక్తి కొలది కట్నం ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఆ కట్నం సరిపోకపోవడంతో పెళ్లి జరిగిన రెండో రోజు నుంచే ఫర్జానాకు కట్నం వేధింపులు మొదలయ్యాయి. రూ.లక్ష, ఒక బైక్ కావాలని అజార్, అతని తల్లిదండ్రులు వేధించడం ప్రారంభించారు. దీంతో ఫర్జానా తల్లి బంధువుల వద్ద అప్పు చేసి రూ.50 వేలు ఇచ్చింది. అయినా అజార్ కుటుంబ సభ్యులు సంతృప్తి చెందలేదు. ఫర్జానాను అజార్ పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. 


అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఫర్జానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అజార్ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అజార్ మారినట్టు నటించాడు. ఫర్జానాను తన ఇంటికి తీసుకెళ్లాడు తర్వాతి రోజు ఉదయం ఫర్జానాకు అజార్ తల్లి టీ చేసి ఇచ్చింది. ఆ టీ తాగగానే ఫర్జానా తీవ్ర అస్వస్థతకు లోనైంది. అజార్, అతని తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. చనిపోయే ముందు ఫర్జానా ఓ వీడియో రూపొందించింది. తన భర్త, అత్త, మామ తనకు టీలో విషం కలిపి ఇచ్చారని పేర్కొంది. ఫర్జానా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న అజార్, అతని తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తున్నారు. 

Updated Date - 2022-06-14T17:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising