ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దలు నో చెప్పినా ప్రేమ పెళ్లి.. ఆ భర్త చేసిన ఓ తప్పుడు పనితో కుటుంబమంతా బలి.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2022-01-24T22:28:58+05:30

అతడి వయసు ప్రస్తుతం 40ఏళ్లు. పెద్దలను ఎదరించి మరీ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో అతడికి సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఏ సపోర్ట్ లేకుండా సొంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు ప్రస్తుతం 40ఏళ్లు. పెద్దలను ఎదరించి మరీ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో అతడికి సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే తాజాగా అతడు చేసిన ఓ తప్పుడు పని కారణంగా కుటుంబమంతా బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పుట్టిన పిల్లలను కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. అతడు చేసిన తప్పేంటి? భార్యాపిల్లల్ని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మదన్ అగర్వాల్.. కిరణ్ అగర్వాల్‌ను ప్రేమించాడు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదురించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహాయం అందకున్నా.. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం అభివృద్ధి చెందుతున్న తరుణంలోనే కొడుకు వ్రిషభ (10), కూతురు టియా (5) జన్మించారు. ఇంతకాలంగా సంతోషంగా సాగిపోతున్న ఆ దంపతుల జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. మదన్ అగర్వాల్ చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం బలైంది. 



కొద్ది రోజులుగా క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన మదన్ అగర్వాల్ అందులో సుమారు రూ.25లక్షలను పోగొట్టుకున్నాడు. దీంతో అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి చంపేసిన మదన్ అగర్వాల్.. పీక కోసి భార్యను హతమార్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సందేహం వ్యక్తం చేసిన అతడి స్నేహితులు శాంతినగర్‌లో ఉన్న మదన్ అగర్వాల్ ఇంటికి చేరుకున్నారు. తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం.. ఎంత పిలిచినా ఫలితం లేకపోవడం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-24T22:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising