ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో తండ్రిలేని సమయంలో తల్లికి అనారోగ్యం.. పక్కింటి వ్యక్తి సహాయం కోరిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-01-27T06:08:36+05:30

ఓ యువతి తన తల్లితో ఇంట్లో ఒంటరిగా ఉంది. తండ్రి పనిమీద వేరే ఊరు వెళ్లాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆమె తల్లికి జబ్బు చేసింది. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఏం చేయాలో తోచగ పక్కింటి అంకుల్ ఇంటికి వెళ్లింది. అతను బయటి నుంచి మందులు తీసుకొచ్చేందుకు ఆమెకు తోడుగా వెళ్లాడు. ఆ తరువాత ఒక నిర్మానుష ప్రాంతానికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ యువతి తన తల్లితో ఇంట్లో ఒంటరిగా ఉంది. తండ్రి పనిమీద వేరే ఊరు వెళ్లాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆమె తల్లికి జబ్బు చేసింది. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఏం చేయాలో తోచగ పక్కింటి అంకుల్ ఇంటికి వెళ్లింది. అతను బయటి నుంచి మందులు తీసుకొచ్చేందుకు ఆమెకు తోడుగా వెళ్లాడు. ఆ తరువాత ఒక నిర్మానుష ప్రాంతానికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పాండవ్ నగర్ ప్రాంతంలో నివసించే ప్రియాంక(17, పేరు మార్చబడినది) అనే అమ్మాయి జనవరి 22న అర్థరాత్రి తన ఇంట్లో తల్లితో ఒంటరిగా ఉంది. ఆ రోజు ఉదయం ప్రియాంక తండ్రి పనిమీద వేరే ఊరు వెళ్లాడు. సాయంత్రం నుంచి ఆమె తల్లికి తీవ్ర జ్వరం చేసింది. రాత్రి గడిచే కొద్దీ పరిస్థితి విషమించింది. ఇంట్లో మందులు కూడా లేవు. ఏం చేయాలో తెలియక సహాయం కోసం పక్కింటి అరుణ్ అంకుల్ ఇంటికి వెళ్లింది. ఆయన పరిస్థితి వివరించి సహాయం అడిగింది. దీంతో అరుణ్ ప్రియాంక తల్లి కోసం మందులు తీసుకొచ్చేందుకు తనతో రమ్మని ప్రియాంకకు చెప్పాడు. అలా ప్రియాంక పక్కింటి అంకుల్‌తో కలిసి అర్ధరాత్రి తన తల్లికి మందులు తీసుకురావడానికి బయటికి వెళ్లింది. 


కానీ అరుణ్ ఆ సమయంలో ప్రియాంక అందాన్ని చూసి కామించాడు. మందులషాపుకి బదులు ఊరి చివర నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కానీ ప్రియాంక మరుసటి రోజు ధైర్యం చేసి తన తండ్రితో విషయం చెప్పింది. ఆ తరువాత ఆమె తండ్రి పోలీసులకు అరుణ్‌పై ఫిర్యాదు చేశాడు. 


పోలీసులు ప్రియాంక మెడికల్ టెస్టు చేసి అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయ్యాక అరుణ్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అరుణ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అరుణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-01-27T06:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising