నాన్నకు ప్రేమతో...
ABN, First Publish Date - 2022-07-19T15:28:44+05:30
తేని జిల్లా కొంబుకారన్పులియూరు గ్రామంలో అన్నదమ్ములు ఏడాదికి ముందు మృతి చెందిన తండ్రిని నిత్యం స్మరించుకునేలా రూ.15లక్షలతో ఆయన
- తల్లి ఆశ నెరవేర్చిన తనయులు
- రూ.15లక్షలతో విగ్రహం
చెన్నై, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తేని జిల్లా కొంబుకారన్పులియూరు గ్రామంలో అన్నదమ్ములు ఏడాదికి ముందు మృతి చెందిన తండ్రిని నిత్యం స్మరించుకునేలా రూ.15లక్షలతో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామస్థుల ప్రశంసలందుకున్నారు. ఆ గ్రామంలో రాము, పచ్చయమ్మాళ్ అనే దంపతులు నివసించేవారు. వీరికి పెరియ ఈశ్వరన్, చిన్న ఈశ్వరన్ అనే కుమారులున్నారు. ఇద్దరికి పెళ్ళిళ్లు జరగ్గా, కుటుంబీకులంతా కలిసి నివసించేవారు. ఈ నేపథ్యంలో గతేడాది రాము మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. పచ్చయమ్మాళ్ తన భర్తను నిత్యం స్మరించుకునే విధంగా ఏదైనా చేయాలని కుమారులను కోరింది. ఆ మేరకు కుమారులిద్దరూ రూ.15 లక్షలతో నిలువెత్తు తండ్రి కాంస్య విగ్రహాన్ని తయారు చేసి తమ తోటలో ప్రతిష్ఠించారు.
Updated Date - 2022-07-19T15:28:44+05:30 IST