ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులను మేపుతుండగా భూమిలో రైతుకు కనిపించిన స్టీల్ డబ్బా.. అనుమానంగానే దాన్ని ఓపెన్ చేస్తే..

ABN, First Publish Date - 2022-06-17T22:11:28+05:30

ఎప్పటిలాగే ఆ రైతు.. మేత కోసం పశువులను బహిరంగ ప్రదేశానికి తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో ఆ రైతుకు భూమిలో ఓ స్టీల్ డబ్బా కనిపించింది. తొలుత దాన్ని లైట్ తీసుకున్న ఆయన.. ఆ తర్వాత దాన్ని బయటకు తీశాడు. అనంతరం అనుమానంగానే భయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఆ రైతు.. మేత కోసం పశువులను బహిరంగ ప్రదేశానికి తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో ఆ రైతుకు భూమిలో ఓ స్టీల్ డబ్బా కనిపించింది. తొలుత దాన్ని లైట్ తీసుకున్న ఆయన.. ఆ తర్వాత దాన్ని బయటకు తీశాడు. అనంతరం అనుమానంగానే భయపడుతూ దాన్ని ఓపెన్ చేశాడు. ఈ నేపథ్యంలో అందులో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. అనంతరం ఆయన చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ రైతుకు డబ్బాలో ఏం కనిపించింది? ఎందుకు ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌లోని శరభండ గ్రామానికి చెందిన ముకేశ్‌భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఆయనకు.. పక్క ఊరి సరిహద్దు ప్రాంతంలో భూమిలో ఓ స్టీల్ డబ్బా ఉన్నట్టు గుర్తించారు. తొలుత దాన్ని తేలికగా తీసుకున్న ఆయన.. ఆ తర్వాత స్టీల్ బాక్సును భూమిలోంచి తీసి, ఓపెన్ చేశారు. అందులో సుమారు రూ.22వేలు ఉండటంతో కంగుతిన్నారు. వెంటనే సదరు గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లి విషయం వివరించారు. ఆ తర్వాత ఆ డబ్బు మున్నాభాయ్ అనే రైతువని తెలిసి.. మొత్తాన్ని ఆయనకు అప్పగించారు. ఈ క్రమంలో మున్నాభాయ్ సంతోషం వ్యక్తం చేశారు. 



ఇంటి మరమ్మత్తుల కోసం కష్టపడి సంపాదించిన డబ్బు.. గత ఏడాది వచ్చిన వరదల వల్ల కొట్టుకుపోయిందని.. దీంతో కొన్ని రోజులు బాధపడి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు చెప్పారు. అయితే సంవత్సరం తర్వాత డబ్బు తిరిగి తన వద్దకు చేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో.. ఆ డబ్బులోంచి కొంత డబ్బును దేవుని హుండీలో వేసిన మున్నాభాయ్.. ఇంకొంత మొత్తాన్ని ముకేశ్‌భాయ్ ఇవ్వబోయారు. అయితే ఆ డబ్బును ముకేశ్‌భాయ్ సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముకేశ్‌భాయ్ చేసిన పని ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. నెట్టింట్లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ముకేశ్‌భాయ్‌ని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


Updated Date - 2022-06-17T22:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising