ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OLXలో పెట్టిన యాడ్ చూసి కాల్ చేసిన వ్యక్తి.. ఫర్నిచర్ కొంటానంటూ బేరం.. చివరకు చూస్తే..

ABN, First Publish Date - 2022-01-13T16:00:32+05:30

అతను ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు.. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు.. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు.. తను కొనుక్కుంటానన్నాడు.. రేటు విషయంలో బేరం ఆడాడు.. డబ్బులు వేస్తానని చెప్పి బ్యాంక్ వివరాలు అడిగాడు.. చివరకు రూ.56 వేలు కాజేశాడు.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. హర్యానాలోని అంబాలాలో ఈ ఘటన జరిగింది. 


అంబాలాకు చెందిన సతీష్ మహంత్ అనే వ్యక్తి పాత ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్‌ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఫర్నిచర్ బాగుందని, తనకు కావాలని అడిగాడు. రేటు విషయంలో బేరం ఆడాడు. చివరకు రూ.3800కు ఒప్పందం కుదిరింది. డబ్బులు పేటీఎమ్ ద్వారా పంపిస్తానని చెప్పి సతీష్ బ్యాంక్ ఖాతా వివరాలు అడిగాడు. 


సతీష్ తన డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ కూడా చెప్పేశాడు. దీంతో అవతలి వ్యక్తి సతీష్ ఖాతా నుంచి రూ.56 వేలు లాగేశాడు. ఆ విషయం సతీష్‌కు ఒకరోజు ఆలస్యంగా తెలిసింది. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2022-01-13T16:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising