ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కసారిగా కోటీశ్వరుడైన కూలీ.. రష్యా నుంచి కాల్ గర్ల్స్ పిలిపించి మందు పార్టీలు.. అంత డబ్బు ఎలా సంపాదించాడంటే..

ABN, First Publish Date - 2022-03-13T05:37:07+05:30

అతను ఒక వడ్రంగి కార్మికుడు. రోజూ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాంటిది అతను ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. స్నేహితులతో కలిసి మందు పార్టీలు చేసుకున్నాడు. రష్యన్ అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఒక వడ్రంగి కార్మికుడు. రోజూ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాంటిది అతను ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. స్నేహితులతో కలిసి మందు పార్టీలు చేసుకున్నాడు. రష్యన్ అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు. అతనికి అంత డబ్బు ఎలా వచ్చిందా? అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని రోజుల్లోనే అసలు విషయం బయటపడింది. 


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దుర్గేష్ అనే వ్యక్తి కార్పెంటర్‌ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజుల క్రితం అతను నగల వ్యాపారి రాజేష్ సోనీ అనే వ్యక్తి ఇంటికి పని కోసం వెళ్లాడు. ఆ క్రమంలో అక్కడున్న బంగారు బిస్కెట్లపై దుర్గేష్ కన్ను పడింది. తోటి కార్మికులు బాబూలాల్, ముఖేష్‌‌లతో కలిసి దుర్గేష్ రెండు పెద్ద బంగారు బిస్కెట్లను దొంగిలించాడు. వాటిని కరిగించి అమ్ముకున్నాడు. ఆ డబ్బులతో ఫుల్‌గా ఎంజయ్ చేశాడు. 


స్నేహితులతో కలిసి రూమ్ తీసుకుని రోజూ మందు పార్టీలు చేసుకునేవాడు. తన గ్రామంలో రెండంతస్థుల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే ఇటీవల రాజేష్ సోనీ తన ఇంటి బీరువాలో చూసుకున్నప్పుడు రెండు బంగారు బిస్కెట్లు పోయినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో పనిచేసిన దుర్గేష్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గేష్‌తోపాటు బాబూలాల్, ముఖేష్‌‌లను కూడా అరెస్ట్ చేశారు. వారు పోలీసుల ఎదుట నిజం అంగీకరించారు. 


Updated Date - 2022-03-13T05:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising